Share News

ఓరి దేవుడా!

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:31 AM

పండగొస్తే ఇంట్లో పూజలు చేస్తాం. బయట ఉన్న గుడులకు వెళతాం. కానీ... జగన్‌ తీరే వేరు. ఆయన ఏకంగా తన క్యాంపు కార్యాలయంలోనే గుడిని ‘కట్టేశారు’.

ఓరి దేవుడా!

పండగొస్తే ఇంట్లో పూజలు చేస్తాం. బయట ఉన్న గుడులకు వెళతాం. కానీ... జగన్‌ తీరే వేరు. ఆయన ఏకంగా

తన క్యాంపు కార్యాలయంలోనే గుడిని ‘కట్టేశారు’. దేవుళ్లను ‘రప్పించారు’! ఈ ‘సంబరమంతా’ మొన్న సంక్రాంతికి జరిగింది. జగన్‌ సతీమణి భారతి ఏనాడూ బయట గుడులకు వచ్చిందీ లేదు. వారిద్దరూ కలిసి జంటగా పూజలు చేసిందీ లేదు. కానీ... ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సంక్రాంతికి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో కలిసి పూజలు చేశారు. చుట్టు పక్కల గుడులే లేనట్లు దీనికోసం భారీ సెట్టింగులు వేశారు. తిరుమల ఆనంద నిలయాన్ని పోలిన సెట్టింగ్‌... చుట్టూ మండపాలు... ఈ హంగామా అంతా ఇంతా కాదు. విజయవాడలో, చుట్టుపక్కల ఆలయాలే లేనట్లుగా, ఇంట్లోనే ‘కృతిమ’ ఆలయాన్ని సృష్టించారు. దీనికోసం రూ.కోటిన్నర దాకా ఖర్చు పెట్టినట్లు తెలిసింది.

Updated Date - Apr 24 , 2024 | 03:31 AM