వైభవంగా కోదండరాముని రథోత్సవం
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:01 AM
ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం కోదండరాముడి రథోత్సవం వైభవంగా సాగింది.
ఒంటిమిట్ట, ఏప్రిల్ 23: ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం కోదండరాముడి రథోత్సవం వైభవంగా సాగింది. ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తజనం హాజరై సీతారాములను చూసి పునీతులయ్యారు. అంతకుముందు సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథశాలకు తరలించారు. సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరాముడు రథాన్ని అధిష్ఠించి మాడవీధుల్లో విహరించారు. కోలాటాలు, చెక్కభజనలు, భజన బృందాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య రథోత్సవం కన్నులపండువగా సాగింది.