విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్!
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:16 AM
విశాఖపట్నం నుంచి ప్రస్తుతం సింగపూర్కు మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండగా త్వరలో బ్యాంకాక్, కౌలాలంపూర్లకు కూడా సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఏపీ విమాన ప్రయాణికుల సం ఘం వెల్లడించింది.
![విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్!](https://media.andhrajyothy.com/media/2023/20231205/klfdhb_46d37ff92c.jpg)
ఏప్రిల్ నుంచి అందుబాటులోకి విమాన సర్వీసులు
విశాఖపట్నం, పిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి ప్రస్తుతం సింగపూర్కు మాత్రమే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండగా త్వరలో బ్యాంకాక్, కౌలాలంపూర్లకు కూడా సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఏపీ విమాన ప్రయాణికుల సం ఘం వెల్లడించింది. విశాఖపట్నంలో గురువారం సంఘం ప్రతినిఽధులు కుమార్రాజా, నరేశ్కుమార్, డీఎస్ వర్మ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి బ్యాంకాక్కు మంగళ, గురు, శనివారాల్లో ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు ఉంటాయన్నారు. టికెట్ ధర రూ.7,999గా నిర్ణయించినట్టు తెలిపారు. బ్యాంకాక్ నుంచి కాంబోడియా, చైనా, హాంగ్కాంగ్, ఇండోనేషియా, జపాన్, లావోస్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు కూడా వెళ్లవచ్చునన్నారు. అలాగే ఏప్రిల్ 26 నుంచి కౌలాలంపూర్కు బుధ, శుక్ర, ఆదివారాల్లో ఎయిర్ ఏసియా విమానం నడుస్తుందని, దీనికి కూడా కాంబోడియా, చైనా, హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఆస్ట్రేలియా దేశాలకు కనెక్టింగ్ విమానాలు ఉంటాయని తెలిపారు. చెన్నై నుంచి విశాఖపట్నం మీదుగా పుదుచ్చేరికి క్రూయిజ్ నౌక ఆగస్టు నుంచి అందుబాటులోకి రానుందని ఏపీ టూర్స్, ట్రావెల్స్ సంఘం అధ్యక్షుడు విజయమోహన్ తెలిపారు.