Share News

పత్తికొండలో నాలుగు నామినేషన్ల దాఖలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:47 AM

అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి రెండో రోజు శుక్రవారం నియోజకవర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్వో రామలక్ష్మి తెలిపారు. టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు, ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య, వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి, వైసీపీ తరుపున రామ్మోహన్‌ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారని ఆర్వో తెలిపారు.

 పత్తికొండలో నాలుగు నామినేషన్ల దాఖలు

పత్తికొండ, ఏప్రిల్‌ 19: అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి రెండో రోజు శుక్రవారం నియోజకవర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్వో రామలక్ష్మి తెలిపారు. టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు, ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య, వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి, వైసీపీ తరుపున రామ్మోహన్‌ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారని ఆర్వో తెలిపారు. ర్యాలీగా వచ్చి వైసీపీ అభ్యర్తి కంగాటి శ్రీదేవి నామినేషన్‌ వేయగా.. మంచి రోజు కావడంతో మొదటి సెట్‌ కింద కేఈ శ్యాంబాబు, రామచంద్రయ్య నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌ తల్లి శ్రీదేవికి మద్దతుగా వైసీపీ తరుపున నామినేషన్‌ దాఖలు చేశారు. 22న ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య, 24న టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబులు భారీ ర్యాలీతో నామినేషన్లు వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 20 , 2024 | 12:47 AM