భూ దోపిడీ కోసమే!
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:19 AM
భూ దోపిడీని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రూపకల్పన జరిగిందని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చింది అందుకే
ఎన్డీయే కూటమి నేతలు శివశంకర్, పట్టాభి, భానుప్రకాశ్ ధ్వజం
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): భూ దోపిడీని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రూపకల్పన జరిగిందని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నిరసిస్తూ ఆ పా ర్టీల నేతలు గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ మాట్లాడుతూ లోపభూయిష్టంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందననననన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ జగనన్న భూరక్ష పేరుతో సీఎం జగన్ భూ భక్షణకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.