మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:26 AM
సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మొదటి రోజు గురువారం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో చిరంజీవి తెలిపారు.
ఎమ్మిగనూరు రూరల్, ఏప్రిల్18: సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మొదటి రోజు గురువారం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో చిరంజీవి తెలిపారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఆయన సతీమణి నిత్యాదేవి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో సీఐలు ప్రసాద్, మధుసుదన్రావు, మోహన్రెడ్డి, మంజునాథ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.