Share News

గుండెపోటుతో రైతు మృతి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:44 PM

మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన రైతు ఈడిగ పెద్ద నరసింహులు (56) గుండె పోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో రైతు మృతి

మంత్రాలయం, ఏప్రిల్‌ 30: మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన రైతు ఈడిగ పెద్ద నరసింహులు (56) గుండె పోటుతో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వచ్చి ఇంటి వద్దనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఇరుగు పొరుగు వారు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కొడుకులు, భార్య పద్మమ్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సోదరుడు, మాజీ సర్పంచు రఘునాథరెడ్డి, రైతు మృతదేహానికి నివాళి అర్పించారు.

Updated Date - Apr 30 , 2024 | 11:44 PM