నీలి పత్రికలో తప్పుడు రాతలు: వర్ల
ABN , Publish Date - May 26 , 2024 | 02:03 AM
ఎన్నికల రోజు నిశ్శబ్ద విప్లవం వైసీపీని కాలికిందేసి తొక్కేసింది. దీంతో నిరాశ, నిస్పృహతో నీలిపత్రికలో తప్పుడు రాత లు రాస్తున్నారు’
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల రోజు నిశ్శబ్ద విప్లవం వైసీపీని కాలికిందేసి తొక్కేసింది. దీంతో నిరాశ, నిస్పృహతో నీలిపత్రికలో తప్పుడు రాత లు రాస్తున్నారు’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వెబ్కాస్టింగ్ బటన్ నొక్కేది చంద్రబాబేనంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. సీఎస్ జవహర్రెడ్డి, పీఎ్సఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాఽథ్రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి... అంతా మీ వాళ్లే కదా..! చంద్రబాబు హైజాక్ చేసి బటన్లు నొక్కుతుంటే మీ వాళ్లు ఊరుకుంటారా? వైసీపీ నేతలు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏ పోలీసులు పిన్నెల్లికి సలాం కొట్టారో ఆ పోలీసులే ఆయనను బాదడానికి సిద్ధంగా ఉన్నా రు. పోలీసులు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి కేసులో పిన్నెల్లిని ఏ 1గా చేర్చాలి’ అని వర్ల అన్నారు.