సజావుగా ఎన్నికలు
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:20 AM
ఎన్నికల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, అందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖే్షకుమార్ మీనా చెప్పారు.
![సజావుగా ఎన్నికలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/JJ_db4f55bf88.jpg)
ఈసీ నిబంధనలు పాటించండి: సీఈవో మీనా
విశాఖపట్నం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, అందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖే్షకుమార్ మీనా చెప్పారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లోగల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఏఈఆర్వో (అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్)లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసీ మార్గదర్శకాలు, సూచనలు పాటిస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. ఇందుకోసం 1,000 మందికి శిక్షణ ఇస్తామన్నారు. తొలివిడతలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. నెలాఖరుకల్లా అందరికీ శిక్షణ ఇస్తామన్నారు.