స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:04 AM
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఐ గంగనాధ్బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
![స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి](https://media.andhrajyothy.com/media/2024/20240413/15_LRP_3_b61c5cc210.gif)
లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్ 15: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఐ గంగనాధ్బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. ఎస్పీ క్రిష్ణారావు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం కుర్నూతల గ్రామంలో ఎగువవడ్డెపల్లె, దిగువవడ్డెపల్లె, దియ్యలవాండ్లపల్లె, వెంకటరాజుగారిపల్లె, సమస్యాత్మకమైన గ్రామాల్లో కేంద్రబలగాలు, సీఆర్పీఎఫ్ కమాండ్ విక్రమ్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, కొత్త వ్యక్తుల సంచారం, మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే వెంటనే కేసులు బనాయిస్తామన్నారు. రాత్రివేళల్లో నూతన వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలు, సీఆర్పీఎ్ఫ, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.