వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే: లోకేశ్
ABN , Publish Date - Feb 25 , 2024 | 03:08 AM
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇక వార్ వన్సైడ్...
![వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే: లోకేశ్](https://media.andhrajyothy.com/media/2024/20240224/dfjghv_ff4f42b9a3.jpg)
మంగళగిరి, ఫ్రిబవరి 24: ‘టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇక వార్ వన్సైడ్... వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడ రాదు’ అని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాట్లాడారు. ‘నేను నాలుగు సంవత్సరాల 10 నెల ల పాటు మంగళగిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉ న్నా. అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్లు ఇక్కడి ప్రజలకు ఏం చేశారు? నేను చేసినదాంట్లో కనీసం 10 శాతం సేవలను అందించలేకపోయారు. నేను ఇక్కడే నివశిస్తున్నాను. నా ఓటు ఈ నియోజకవర్గంలోనే వుంది. ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడ వుందో మీరే చెప్పాలి. మంగళగిరిలో నా ప్రచారం నేను ఓటమి చెందిన మరుసటి రోజునుంచే ఆరంభమైంది. దా దాపు 80 శాతం మంగళగిరిలో నేను పర్యటించా. మిగిలిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తా’ అని అన్నారు.