Share News

Thadepalligudem: సీఎం జగన్ వద్దకు మంత్రి రోజా పంచాయితీ.. వైసీపీలో బయటపడుతున్న విభేదాలు

ABN , Publish Date - Mar 13 , 2024 | 06:30 PM

మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాపై(Minister Roja) అసమ్మతి స్వరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా వైసీపీకి(YSRCP) కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

Thadepalligudem: సీఎం జగన్ వద్దకు మంత్రి రోజా పంచాయితీ.. వైసీపీలో బయటపడుతున్న విభేదాలు

తాడేపల్లి: మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాపై(Minister Roja) అసమ్మతి స్వరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా వైసీపీకి(YSRCP) కొత్త తలనొప్పులు వస్తున్నాయి. రోజాపై బహిరంగంగా ఆమె వ్యతిరేక వర్గం విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో రోజా బుధవారం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ముందు ఆమె గోడు వెల్లబోసుకున్నారు.

ఈ సారి రోజాకు నగరి సీటు ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఆమెకు సీటిస్తే తప్పనిసరిగా ఓడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో రోజా అసమ్మతి నేతలపై జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 13 , 2024 | 06:43 PM