ఆంధ్రకు ఈసీ ప్రత్యేక పరిశీలకులు
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:04 AM
ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ర్టాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది.
![ఆంధ్రకు ఈసీ ప్రత్యేక పరిశీలకులు](https://media.andhrajyothy.com/media/2024/20240326/11_aef1b670dc.jpg)
న్యూఢిల్లీ, అమరావతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ర్టాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఏపీకి జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా రామ్ మోహన్ మిశ్రా, పోలీస్ స్పెషల్ అబ్జర్వర్గా దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా నీనా నిగమ్లను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎ్సలకు ప్రత్యేక పరిశీలనా బాధ్యతలను సార్వత్రిక ఎన్నికల ముందు ఈసీ అప్పగించడం పరిపాటే. తప్పుడు ప్రచారం, కల్పిత కథనాలు వ్యాప్తి చెందకుండా సత్వరం కళ్లెం వేయడం వీరికి అప్పగించిన ప్రధాన బాధ్యత. అలాగే, సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తారు. కాగా, ఏపీతోపాటు ఒకేసారి అసెంబ్లీ, లోక్సభలకు ఎన్నికలు జరుపుకొంటున్న ఒడిశాకు జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా యోగేంద్ర త్రిపాఠి, పోలీస్ స్పెషల్ అబ్జర్వర్గా రజనీకాంత్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా హిమాలిని కశ్య్పలను ఎంపిక చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.