Share News

గ్రామాల్లో పర్యటించిన డీఎస్పీ

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

మండల పరిధిలోని పార్లపల్లి, గువ్వలదొడ్డి, కలుగొట్ల, కె.నాగలాపురం గ్రామాల్లో ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య , ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డిలు విస్తృతంగా పర్యటించారు.

గ్రామాల్లో పర్యటించిన డీఎస్పీ

ఎమ్మిగనూరు రూరల్‌, ఏప్రిల్‌15: మండల పరిధిలోని పార్లపల్లి, గువ్వలదొడ్డి, కలుగొట్ల, కె.నాగలాపురం గ్రామాల్లో ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య , ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డిలు విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా చట్టవిరుద్ద పనులు జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM