Share News

పంచాయతీ ఆఫీసులోనే మద్యపానం

ABN , Publish Date - May 20 , 2024 | 03:57 AM

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పా టు చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వైసీపీ సర్పంచ్‌ భర్త దర్జాగా మందు పార్టీ చేసుకున్నారు.

పంచాయతీ ఆఫీసులోనే మద్యపానం

వైసీపీ సర్పంచ్‌ భర్త ఆధ్వర్యంలో మందు పార్టీ

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో దారుణం

పెద్దవడుగూరు, మే 19: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పా టు చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వైసీపీ సర్పంచ్‌ భర్త దర్జాగా మందు పార్టీ చేసుకున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలకేంద్రం లో ఆదివారం జరిగిందీ దారుణం. వైసీపీ మద్దతు సర్పంచ్‌ వరలక్ష్మి భర్త సుంకన్న ఆధ్వర్యంలో పలువురు పంచాయతీ కార్యాలయంలోపల దర్జాగా కుర్చీల్లో కూర్చుని మద్యం సేవించారు. తాత్కాలిక సిబ్బంది వద్ద కార్యాలయ తాళాలు ఉంచడంతో, వారి నుంచి తాళాలు తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం ఆ కార్యాలయంలోకి ప్రవేశించి, తలుపులు వేసుకుని చికెన్‌ ముక్కలు, వాటర్‌ బాటిళ్లు పక్కన పెట్టుకుని మద్యం తాగుతూ కనిపించారు. సాయంత్రం దాకా అక్కడే ఉన్నారు. మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని ఫొటోలు తీస్తుండగా.. ‘కావాల్సినన్ని ఫొటోలు తీసుకోండి.. ఏమైనా రాసుకోండి’ అంటూ సవాలు విసిరారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి మురళీధర్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్యాలయ తాళాలు తాత్కాలిక సిబ్బంది వద్ద ఉండడం వల్లే ఇలా జరిగి ఉంటుందనీ, దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 03:57 AM