అద్దె హెలికాప్టర్ తీసుకోవద్దు సీఎ్సకు అచ్చెన్న లేఖ
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:42 AM
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
![అద్దె హెలికాప్టర్ తీసుకోవద్దు సీఎ్సకు అచ్చెన్న లేఖ](https://media.andhrajyothy.com/media/2024/20240224/dd_a49502d927.jpg)
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడాన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఒక్కో హెలికాప్టర్కు నెలకు రూ.1.92 కోట్ల చొప్పున రెండింటికి రూ.3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృఽథా చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, అధికారంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం దానిని నిబద్ధతతో అమలు పరచాలన్నారు. ఈ నేపఽథ్యంలో రెండు హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవాలని జీఓలు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు.