ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు
ABN , Publish Date - May 17 , 2024 | 03:37 AM
శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్ కొయ్యే మోషేన్రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్ కొయ్యే మోషేన్రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున జంగా కృష్ణమూర్తి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీ చేసిన విజ్ఞప్తి మేరకు మండలి చైర్మన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు.