Share News

మున్సిపల్‌ ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - May 25 , 2024 | 11:31 PM

మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనుపమ ఉత్తర్వులు జారీ చేవారు.

మున్సిపల్‌ ఉద్యోగుల తొలగింపు

ఆదోని, మే 25: మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనుపమ ఉత్తర్వులు జారీ చేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఉద్యోగ సేవలు అందిస్తున్న రామాంజనేయులు అలియాస్‌ పీటర్‌ ఎన్నికల రోజు వైసీపీకి ఓటు వేయాలని తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారని తెలిపారు. అలాగే 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ చిన్న పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి గడ్డం రాజు ఆయనకు జన్మదిన వేడుకలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని వివరించారు. వీరిపై ఫిర్యాదులు రావడంతో తాము విచారణ చేసి నిజమని నిర్ధారణ కావడంతో వీరిద్దరినీవిధులనుంచి తొలగిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 11:31 PM