ఓటుకు నోటు అందిందా..!
ABN , Publish Date - May 19 , 2024 | 03:19 AM
ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగా జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన యలమంచిలిలో శనివారం 20 మంది సభ్యుల బృందం పర్యటించింది.
![ఓటుకు నోటు అందిందా..!](https://media.andhrajyothy.com/media/2024/20240511/ff_bb772cbea6.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఆరా
యలమంచిలి, మే 18: ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ సరిగా జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన యలమంచిలిలో శనివారం 20 మంది సభ్యుల బృందం పర్యటించింది. బృంద సభ్యులు పలు ఇళ్లకు వెళ్లి ‘అమ్మా... మీ కుటుంబంలోని ఓట్లకు సొమ్ములు అందాయా? ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఇచ్చారు?’ అని ఆరా తీశారు. ఎన్నికలైన తర్వాత ఇలాంటి విచారణ జరగడం తాము గతంలో ఎన్నడూ చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.