Share News

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:50 PM

మార్చి 31న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గొడుగు వెంకటేశ్వరమ్మ (55) శుక్రవారం మృతి చెందింది.

ఐదుకు చేరిన మృతుల సంఖ్య

మద్దికెర, ఏప్రిల్‌ 5 : గ్రామ శివారులో మార్చి 31న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ గొడుగు వెంకటేశ్వరమ్మ (55) కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. మార్చి 31న చిప్పగిరి మండలంలో మిరపకాయలు తెంచేందుకు కూలీలు ఆటోలో వెళ్తూ టైరు పేలీ విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు వీరిలో ఇప్పటిదాకా ఐదుగురు కూలీలు మృతిచెందారు. ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

మద్దికెర : వ్యవసాయ పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలుగు యువత తాలుకా ఉపాధ్యక్షుడు ఎన్‌.చంద్రమోహన్‌, మండల టీడీపీ ఉపాధ్యక్షులు టైలర్‌ హరి అన్నారు. ఇంత వరకు అధికారులకు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించలేదని పేర్కొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:50 PM