కిక్కిరిసిన గుణదల
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:33 AM
మూడు రోజులుగా జరుగుతున్న గుణదల మేరీమాత 100 వసంతాల మహోత్సవాలు ఆదివారంతో ముగియగా, భక్తులు భారీగా తరలివచ్చారు.
![కిక్కిరిసిన గుణదల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ముగిసిన మేరీమాత 100 వసంతాల వేడుకలు
విజయవాడ (గుణదల), ఫిబ్రవరి 11: మూడు రోజులుగా జరుగుతున్న గుణదల మేరీమాత 100 వసంతాల మహోత్సవాలు ఆదివారంతో ముగియగా, భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గుణదల పురవీధులు కిక్కిరిసిపోయాయి. కొండ కింద మేరీమాత ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన భక్తులు కొండపై గుహలోని మరియమాతను దర్శించుకున్నారు.