నేడు పత్తికొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాక
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 AM
ఇండియా కూటమి బలపరుస్తున్న సీపీఐ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహేబ్ తెలిపారు.
![నేడు పత్తికొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 27: ఇండియా కూటమి బలపరుస్తున్న సీపీఐ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహేబ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరలుతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దికెరలో ఉదయం 8 గంటలకు ప్రచార సభ ప్రారంభమవుతుందని, అనంతరం పెరవలి, తుగ్గలి మండలంలో జొన్నగిరి, వెల్దుర్తి మండలంలో రామక్రిష్ణ వివిధ ప్రచార సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆయన పర్యటనను పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.