Share News

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - May 27 , 2024 | 03:55 AM

శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు.

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీశైలం, మే 26: శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందకు క్యూలైన్లలో బారులుదీరారు. వేకువజామున నుంచే అధిక సంఖ్యలో భక్తులు కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి, పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి అధికారులు అల్పాహారం, తాగునీరు అందజేశారు. కాగా.. క్షేత్ర ప్రధాన వీధులు భక్తులతో కిక్కిరిశాయి.

Updated Date - May 27 , 2024 | 03:55 AM