ఎల్లుండి ఒకేషనల్ ట్రైనర్ పరీక్ష
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:03 AM
వృత్తి విద్య ట్రైనర్ల ఎంపికలో భాగంగా ఒకేషనల్ ట్రైనర్ అభ్యర్థులకు మంగళవారం (31వ తేదీ) కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వృత్తి విద్య ట్రైనర్ల ఎంపికలో భాగంగా ఒకేషనల్ ట్రైనర్ అభ్యర్థులకు మంగళవారం (31వ తేదీ) కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 16 సెంటర్లు ఇందుకోసం ఏర్పాటుచేశామన్నారు. ఎంపికైన ట్రైనర్లు సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో వృత్తి విద్య కోర్సులను బోధిస్తారన్నారు.