ఏపీఈఏపీసెట్లో సత్తా చాటిన భాష్యం
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:38 AM
ఏపీఈఏపీసెట్-2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.
![ఏపీఈఏపీసెట్లో సత్తా చాటిన భాష్యం](https://media.andhrajyothy.com/media/2024/20240604/jj_08dea9fe59.jpg)
రాష్ట్రస్థాయిలో నాలుగు ర్యాంకులు కైవసం
గుంటూరు(విద్య), జూన్ 11: ఏపీఈఏపీసెట్-2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఎం.జిష్ణుసాయి ేస్టట్ ఫస్ట్ ర్యాంక్, ఎం.సాయియశ్వంత్ రెడ్డి 2వ ర్యాంకు, కె.మనీష్ చౌదరి 5వ ర్యాంకు, కె.ప్రభాస్ 10, కె.హర్షిత 16, ఎస్.ప్రణయ్ విక్టర్ 25, ఎం.శ్రీచరిత సాయి 29, టి.మునికార్తీక్ 35, పి.శ్యామ్ 49, కె.చైతన్య 54, ఎం.సాయిజస్వంత్ రెడ్డి 61, ఆర్.రాజ్ శ్రీవర్థన్ 83 ర్యాంకులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు 100 లోపు 12 ేస్టట్ ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచారని వెల్లడించారు. భాష్యం విద్యార్థులు వరుసగా రెండోసారి ేస్టట్ ఫస్ట్ ర్యాంకు సాధించడంతో పాటు టాప్ టెన్లో నాలుగు ర్యాంకులు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.