ప్రజాస్వామ్యంలో తులనాత్మక న్యాయవ్యవస్థ కీలకం
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:33 AM
ప్రస్తుత అంతర్జాతీయ, ఆర్థిక ప్రపంచీకరణ, ప్రజాస్వామ్యీకరణలో కంపారిటివ్ లా (తులనాత్మక న్యాయవ్యవస్థ) కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీంద్ర భట్ అన్నారు.
![ప్రజాస్వామ్యంలో తులనాత్మక న్యాయవ్యవస్థ కీలకం](https://media.andhrajyothy.com/media/2024/20240215/mmm_0d409c9ea2.jpg)
సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీంద్ర భట్
కంపారిటివ్ లాపై విట్-ఏపీలో మూడు రోజుల సదస్సు
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత అంతర్జాతీయ, ఆర్థిక ప్రపంచీకరణ, ప్రజాస్వామ్యీకరణలో కంపారిటివ్ లా (తులనాత్మక న్యాయవ్యవస్థ) కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీంద్ర భట్ అన్నారు. విట్-ఏపీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా (వీఎ్సఎల్), విట్-ఏపీ యూనివర్సిటీ, బర్మింగ్హమ్ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంపారిటివ్ లా’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తులనాత్మక న్యాయవ్యవస్థను వివిధ దేశాల న్యాయవ్యవస్థల మధ్య వ్యత్యాసాలు, సారూప్యతల అధ్యయనంగా అభివర్ణించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ సదస్సు విట్-ఏపీ క్యాంప్సలో గురువారం ప్రారంభమైంది. శనివారం ముగుస్తుంది. కార్యక్రమంలో విట్-ఏపీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోట రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర, విట్-ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.