Share News

టీడీపీ-జనసేన కలయికతో సీఎం జగనకు భయం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:13 AM

టీడీపీ-జనసేన పార్టీల కలయి కతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డికి భ యం పట్టుకుందని అన్నమయ్య జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు.

టీడీపీ-జనసేన  కలయికతో సీఎం జగనకు భయం
ఆరమడక గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు

వాల్మీకిపురం, మార్చి 8: టీడీపీ-జనసేన పార్టీల కలయి కతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డికి భ యం పట్టుకుందని అన్నమయ్య జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం వా ల్మీకిపురం మండలంలోని ఆరమడక, దళితవాడ, ప్రాం తాలలో టీడీపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు ష్యూ రిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇరుపార్టీల సమ్మేళనంతో రూపొందించి న సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటా పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామ గ్రామాన ప్రజలంతా టీడీపీ, జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యక్ర మంలో మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, మాజీ జడ్పీటీసీ వల్లిగట్ల వెంకటరమణ,టీడీపీ పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ బాషా, నాయకులు రాజేంద్రాచారి, కోసూరి రమేష్‌, నాయకులు పీవీ నారాయణ, చంద్రమౌళి, డిష్‌ బ్రదర్స్‌, అడ్వకేట్‌ రమణ, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:13 AM