టీడీపీ అభ్యర్థి గురజాలకు సీకే బాబు మద్దతు
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:17 AM
చిత్తూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనుండగా..
చిత్తూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనుండగా.. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్కు మద్దతు ప్రకటించారు. చిత్తూరులో ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా, మూడుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాబు.. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆదివారం తన ఆత్మీయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అలాగే జగన్మోహన్కు సంఘీభావంగా బెంగళూరులో నిర్మాణ రంగంలో స్థిరపడిన ఆంధ్రులు ఆదివారం అక్కడి నుంచి సుమారు 400 కార్లలో చిత్తూరుకు ర్యాలీగా వచ్చారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు చిత్తూరులో కీలకమైన బలిజ సంఘం నాయకులు కూడా ఆదివారం సమావేశమై టీడీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు.