వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:22 AM
వైసీపీ ప్రభుత్వ హాయంలో మద్యం బాటిళ్లపై అతికించే సెక్యూరిటీ హోలోగ్రామ్ల తయారీ, సరఫరా కాంట్రాక్ట్ టెండర్ అప్పగింత కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హాయంలో మద్యం బాటిళ్లపై అతికించే సెక్యూరిటీ హోలోగ్రామ్ల తయారీ, సరఫరా కాంట్రాక్ట్ టెండర్ అప్పగింత కుంభకోణం వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.