Share News

‘రెడ్‌బుక్‌’పై సీఐడీ అదనపు మెమో

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:36 AM

యువగళం ముగింపు సభ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన ‘రెడ్‌బుక్‌ వ్యాఖ్యలు’పై దాఖలు చేసిన పిటిషన్‌కు అదనంగా మరో మెమోను సీఐడీ దాఖలు

‘రెడ్‌బుక్‌’పై సీఐడీ అదనపు మెమో

ఏసీబీ కోర్టులో దాఖలు

విజయవాడ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): యువగళం ముగింపు సభ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన ‘రెడ్‌బుక్‌ వ్యాఖ్యలు’పై దాఖలు చేసిన పిటిషన్‌కు అదనంగా మరో మెమోను సీఐడీ దాఖలు చేసింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు ఈ మెమోను సోమవారం అందజేశారు. గతేడాది డిసెంబరు 29న లోకేశ్‌ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రసారం చేసిన ఒక చానల్‌ క్లిప్పింగ్‌ను పెన్‌డ్రైవ్‌ ద్వారా కోర్టుకు అందజేశారు. దీనిపై న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు ముందుగా దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ అంశం లేదని న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను న్యాయాధికారి ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Apr 16 , 2024 | 07:17 AM