Share News

సొంతూరుకు బాబు

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:16 AM

తన తమ్ముడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి కర్మక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి

సొంతూరుకు బాబు

నేడు నారావారిపల్లిలో తమ్ముడి కర్మక్రియలు

తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తన తమ్ముడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి కర్మక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి సొంతూరుకు చేరుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామ్మూర్తికి గురువారం స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో కర్మక్రియలు జరగనున్నాయి. తనయుడు, మంత్రి లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి బుధవారం సాయంత్రం 6.35 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. రోడ్డు మార్గాన నారావారిపల్లి వెళ్లారు. గురువారం రాత్రికి నారావారిపల్లిలోనే చంద్రబాబు బస చేస్తారా లేదా సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారా అన్నది ఇంకా ఖరారు కాలేదు. రాత్రికి స్వగ్రామంలోనే గడిపి శుక్రవారం ఉదయం బయల్దేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 06:16 AM