వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు
ABN , Publish Date - May 19 , 2024 | 03:06 AM
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు.
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలోనూ అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేశ్ కూడా అమెరికా వెళ్లారు.