నేడు టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:38 AM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు.
అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమా న్ని శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. రూ.లక్ష చెల్లించిన వారికి టీడీపీ నుంచి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కేవలం రూ.100తో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5 లక్షలు అమలు కానుంది. కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే తెలుగు వారంతా టీడీపీలో చేరాలని అక్కడి టీడీపీ అధ్యక్షుడు నక్కల మాణిక్యరావు యాదవ్ కోరారు. విజయపురంలో ని ఆంధ్రా అసోసియేషన్ హాలులో సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు.