Share News

తాడిపత్రి హింసలో 728 మందిపై కేసులు

ABN , Publish Date - May 21 , 2024 | 03:17 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు చెలరేగిన హింసకు సంబంధించి మొత్తం ఏడు కేసులను పోలీసులు నమోదు చేశారు.

తాడిపత్రి హింసలో 728 మందిపై కేసులు

తాడిపత్రి టౌన్‌, మే 20: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్‌ రోజు, ఆ మరుసటి రోజు చెలరేగిన హింసకు సంబంధించి మొత్తం ఏడు కేసులను పోలీసులు నమోదు చేశారు. మొత్తం 728 మందిపై కేసులు నమోదవగా, వారిలో 396 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని ఇప్పటికే అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. తాడిపత్రిలో జరిగిన హింస, పోలీసుల నిర్లక్ష్యంపై సిట్‌ అధికారులు రెండు రోజులపాటు దర్యాప్తు చేశారు. సమగ్ర వివరాలను సేకరించారు. కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించారు.

Updated Date - May 21 , 2024 | 06:56 AM