కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదు
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:36 PM
ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. పట్టణంలోని కొత్తపేటలో గల ఓ వీధిలో డ్రైనేజీ కాలువ పనులను వైసీపీ నాయకులు ప్రారంభించారు.
![కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుర్రంకొండ, మార్చి 22: ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. పట్టణంలోని కొత్తపేటలో గల ఓ వీధిలో డ్రైనేజీ కాలువ పనులను వైసీపీ నాయకులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అధికారులు పనులను ఆపేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి అభివృద్ధి పనులు చేయరాదని, ఆంక్షలు ఉన్నప్పటికీ కాలువ పనులను ప్రారంభించడం తప్పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘ఎన్నికల నియమావళి వర్తించదా‘ అన్న శీర్షిక ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోడ్ ఉల్లంఘనను శుక్రవారం గుర్తించిన ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పనులను చేయించిన నూర్ అహమ్మద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.