Share News

అవనిగడ్డ బరిలో బుద్ధప్రసాద్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:39 AM

కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఖరారుచేశారు.

అవనిగడ్డ బరిలో బుద్ధప్రసాద్‌

జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్‌

రైల్వేకోడూరులో భాస్కరరావు బదులు శ్రీధర్‌

పాలకొండపై రేపో మాపో నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఖరారుచేశారు. అవనిగడ్డ, పాలకొండ అభ్యర్థులపై గురువారం ఉదయం ఆయన పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. తదుపరి బుద్ధప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు. పాలకొండ అభ్యర్థి పేరును రెండ్రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రైల్వేకోడూరు (ఎస్సీ) అభ్యర్థిని మార్చింది. మొదట ప్రకటించిన యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్‌ను నియమించింది. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిశీలించారు. పవన్‌ పిఠాపురంలో ఉన్న సమయంలో రైల్వేకోడూరు నుంచి జనసేన, టీడీపీ నేతలు వచ్చి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో శ్రీధర్‌ పేరును ఖరారు చేశారు.

Updated Date - Apr 05 , 2024 | 03:39 AM