Share News

టీటీడీ చైర్మన్‌ పదవికి భూమన రాజీనామా

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:17 AM

టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

టీటీడీ చైర్మన్‌ పదవికి భూమన రాజీనామా

తిరుమల, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరఫున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన కుమారుడు అభినయ్‌ కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవోకు రాజీనామా లేఖ రాశారు. గతేడాది ఆగస్టు 10న ఆయన టీటీడీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన ఆయన తొమ్మిది నెలలు ఆ పదవిలో కొనసాగారు. ఆయన సన్నిహితుడు, తిరుపతి గంగమ్మ గుడి పాలక మండలి అధ్యక్షుడు కట్టా గోపీ యాదవ్‌ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పాలక మండలి సభ్యులు కొందరు అందుబాటులో లేరని, బుధవారం అందరం కలిసి రాజీనామాను అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 05 , 2024 | 07:16 AM