Share News

తెలంగాణ ఈఏపీసెట్‌లో భాష్యం విద్యార్థుల సత్తా

ABN , Publish Date - May 19 , 2024 | 03:14 AM

ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీ సెట్‌లో భాష్యం విద్యా ర్థులు సత్తాచాటారని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ  ఈఏపీసెట్‌లో భాష్యం విద్యార్థుల సత్తా

గుంటూరు(విద్య), మే 18: ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీ సెట్‌లో భాష్యం విద్యా ర్థులు సత్తాచాటారని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థి ఎం.సాయియశ్వంత్‌రెడ్డి 5వ ర్యాంకు, ఎం.జిష్ణుసాయి 11, కె.హర్షిత 13, కె.మనీ్‌షచౌదరి 28, కె.ప్రభాస్‌ 31, టి.మునికార్తీక్‌ 58, పి.శ్యామ్‌ 63, ఎం.సాయిజశ్వంత్‌రెడ్డి 65, ఎం.గణే్‌షదత్తా 93, ఎం.శ్రీచరితసాయి 94, డి.పూజ 97, కె.ఆర్‌.ఎస్‌. సుమన్విత 100వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తమ సంస్థ విద్యార్థులు 100లోపు 12 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ, మెడెక్స్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఆయనతోపాటు డైరెక్టర్‌ భాష్యం హనుమంతరావు తదితరులు అభినందించారు.

Updated Date - May 19 , 2024 | 07:49 AM