భానుడు భగభగ
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:27 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రమై, వెచ్చని సెగతో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో అసౌకర్య వాతావరణం నెలకుంటోంది. గురువారం ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది.
అమరావతి, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రమై, వెచ్చని సెగతో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో అసౌకర్య వాతావరణం నెలకుంటోంది. గురువారం ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరింది. అల్లూరి జిల్లా యెర్రంపేట, మన్యం జిల్లా కొమరాడలో 45.8, నంద్యాల జిల్లా నందవరంలో 45.6, విజయనగరం జిల్లా జామిలో 45.5, శ్రీకాకుళం జిల్లా కోవిలం, కడప జిల్లా కొంగలవీడులో 45.4, తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 120 మండలాల్లో మోస్తరు వడగాల్పులు వీచాయి.