వైసీపీలోకి బళ్లారి శాంత
ABN , Publish Date - Jan 03 , 2024 | 03:10 AM
కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు బి.శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జె.శాంత వైసీపీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు.
![వైసీపీలోకి బళ్లారి శాంత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆ వెంటనే హిందూపురం ఎంపీ టికెట్
బీజేపీ నేత శ్రీరాములు సోదరికి ప్రాధాన్యం
అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు బి.శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జె.శాంత వైసీపీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. ఆ వెంటనే ఆమెకు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేశారు. గాలి జనార్దన రెడ్డి అత్యంత సన్నిహితుడైన శ్రీరాములుకు శాంత సొంత సోదరి. గాలి జనార్దన రెడ్డి ప్రోద్బలంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో బళ్లారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడామెను పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని మరీ వైసీపీ టికెట్ ఇచ్చేశారు. కానీ... ఆమెను గుం తకల్లు వాసిగా చూపించడం గమనార్హం. శ్రీరాములు సిఫారసు మేర కు గతంలోనూ జగన్ కొందరికి ఎమ్మెల్యే టికెట్లిచ్చారు. మంత్రి పదవులూ కట్టబెట్టారు. గాలితోజగన్ బాంధవ్యం కొనసాగుతోందనేందుకు ఇది తాజా నిదర్శనం.