కర్ణాటక మద్యం, నాటు సారా విక్రయాలను అడ్డుకోండి
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:36 PM
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కర్ణాటక అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలను అడ్డుకోవడానికి దాడులు ముమ్మరం చేయాలని అనంతపు రం జోన ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ విజ యశేఖర్ ఆదేశించారు.
ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్
ములకలచెరువు, ఏప్రిల్ 24: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కర్ణాటక అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలను అడ్డుకోవడానికి దాడులు ముమ్మరం చేయాలని అనంతపు రం జోన ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ విజ యశేఖర్ ఆదేశించారు. ములకలచెరువు ఎస్ఈబీ స్టేషనను బుధవారం ఆయన తనిఖీ చేసి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాత నేరస్ధులను బైండోవర్ చేయా లన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో ఎస్ఈబీ సీఐ రామ్మోహన, సిబ్బంది పాల్గొన్నారు.