Share News

గులకరాయి కేసులో ‘బెయిల్‌’ విచారణ 23కు వాయిదా

ABN , Publish Date - May 21 , 2024 | 03:16 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

గులకరాయి కేసులో ‘బెయిల్‌’ విచారణ 23కు వాయిదా

విజయవాడ, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం జరిగిన విచారణలో సతీశ్‌కుమార్‌ తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీశ్‌కుమార్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ప్రతివాదనలు వినిపించడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో విచారణను కోర్టు 23వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - May 21 , 2024 | 07:00 AM