Share News

బాబు సభ సక్సెస్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:53 AM

టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు శుక్రవారం ఆలూరులో చేపట్టిన ప్రజాగళం యాత్ర విజయవంతం అయ్యింది.

బాబు సభ సక్సెస్‌
బస్సుయాత్రలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, చిత్రంలో వీరభద్రగౌడ్,బస్తిపాటి నాగరాజు, తిక్కారెడ్డి, హాజరైన జనం

ఆలూరు పసుపు మయంఫ భారీగా తరలివచ్చిన జనం

ఆలూరు/ఆదోని, ఏప్రిల్‌ 19 : టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు శుక్రవారం ఆలూరులో చేపట్టిన ప్రజాగళం యాత్ర విజయవంతం అయ్యింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనం పోటెత్తడంతో పట్టణం పసుపుమయంగా మారింది. ఎల్లార్తి రోడ్డు, ఆదోని రోడ్డు, బళ్లారి రోడ్డు ఎటు చూసినా జనప్రభంజనమే కనిపించింది. అంబేడ్కర్‌ సర్కిల్‌లో జరిగిన రోడ్‌షోలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బి.వీరభద్రగౌడు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో కలిసి చంద్రబాబు మాట్లాడారు. రాబోయే ఎన్డీయే సారథ్యంలోని ప్రజాప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని వరాల జల్లులు కురిపించారు. ‘‘8 టీఎంసీలతో వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. నదిలో నీరు లేకపోతే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు నింపి కరువు నేలకు మళ్లిస్తా. టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. ఆదోనిలో మిరప ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటు, డిగ్రీ కళాశాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం, జాతీయ రహదారితో పాటు ఆలూరు, హొళగుంద రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని’’ హామీ ఇచ్చారు. అదే క్రమంలో ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న బుడగజంగాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అభ్యర్థులను గెలిపించండి

ఆలూరు, ఏప్రిల్‌ 19: రానున్న ఎన్ని కల్లో మీ నియోజక వర్గ టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేయాలని టీడీపీ అధినేత చంద్ర బాబు ఆదోని డివిజన్‌ టీడీపీ సీనియర్‌ నాయకులకు సూచించారు. శుక్రవారం ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలూరుకు వచ్చిన ఆయన ప్రత్యేకంగా బస్సులో మాట్లడారు. ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ గెలుపు కోసం పని పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజంగ్‌ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌ జ్యోతి దంపతులకు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ, రామచంద్ర నాయుడులకు సూచించారు. అలాగే ఆదోని ఉమ్మడి కూటమి అభ్యర్తి డాక్టర్‌ పార్థసారథి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు సూచించారు. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాంబాబు గెలిపించుకురావాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజిగ్‌ కార్యదర్శి తుగ్గలి నాగేంద్రకు సూచించారు.

సభలో నేతలకు భరోసా...

ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు. ఆలూరులో వైకుంఠం కుటుంబం తనకు అండగా ఉందని, ఆయన కుమారుడు వైకుంఠం శివప్రసాద్‌, జ్యోతి పార్టీలో చాలా చురుకుగా పని చేస్తున్నారన్నారు. కొందరు స్వార్థంతో అటుపోయిన వైకుంఠం శివప్రసాద్‌ పార్టీలోనే ఉన్నారు. వారికి. తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే దివంగత నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడును దారుణంగా హత్య చేశారని, ఆయన కూతురు కప్పట్రళ్ల బుజ్జమ్మకు కూడా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 20 , 2024 | 12:57 AM