జర్నలిస్టులపై దాడులు ఆపాలి : ప్రజాసంఘాలు
ABN , Publish Date - May 17 , 2024 | 03:44 AM
తిరుపతిలో జర్నలిస్టులపై దాడులను ఆపకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగుతామని వివిధ ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు హెచ్చరించారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 16: తిరుపతిలో జర్నలిస్టులపై దాడులను ఆపకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగుతామని వివిధ ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు హెచ్చరించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కేంద్ర బలగాలను ఉసిగొల్పి జర్నలిస్టులపై లాఠీచార్జి చేయించిన అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ అసిస్టెంట్ ఎడిటర్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు, స్టాఫ్ రిపోర్టర్ నరేంద్రలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలు ఆపేయాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని వక్తలు డిమాండ్ చేశారు.