Share News

అర్చకులపై దాడి చేసి వారిని అరెస్టు చేయండి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:05 AM

అర్చకులపై దాడిచేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంకే నాగరాజరావు డిమాండ్‌ చేశారు.

అర్చకులపై దాడి చేసి వారిని అరెస్టు చేయండి

ఏపీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎంకే నాగరాజరావు

మంత్రాలయం, మార్చి 26: అర్చకులపై దాడిచేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంకే నాగరాజరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం అర్చకులపై దాడులు అరికట్టాలని ఆయన మంత్రాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడా శివాలయంలో పని చేసే అర్చకులు సాయిశర్మ, విజయ్‌కుమార్‌ శర్మలపై ఈ నెల 25న గర్భగుడిలో పూజలు చేస్తున్న అర్చకులను వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్‌ సిర్యాల చంద్రశేఖర్‌ దాడి చేసి కాలితో తంతూ తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. బ్రాహ్మణ సంగం నాయకులు మైనపాటి చంద్రశేఖర్‌, అన్నదానం వెంకట్రమణ, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు: కాకినాడ శివాలయ అర్చకులు సాయిశర్మ, విజయ్‌ కుమార్‌లపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణకార్పొరేషన్‌ జిల్లా మాజీ కో-ఆర్డినేటర్‌ గురు రాఘవేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బౌతిక దాడికి దిగిన వైసీపీ మాజీ కార్పొరేటర్‌ చంద్రశేఖర్‌పై కేసునమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

Updated Date - Mar 27 , 2024 | 12:05 AM