Share News

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 21 , 2024 | 12:18 AM

నియోజకవర్గంలో 17 రౌండ్లలో ఒక్కో రౌండుకు 14 టేబుళ్లపై లెక్కింపు చేపడుతున్నట్లు మంత్రాలయం రిటర్నింగ్‌ అధికారి మురళి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌మూర్తి తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

మంత్రాలయం, మే 20: నియోజకవర్గంలో 17 రౌండ్లలో ఒక్కో రౌండుకు 14 టేబుళ్లపై లెక్కింపు చేపడుతున్నట్లు మంత్రాలయం రిటర్నింగ్‌ అధికారి మురళి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌మూర్తి తెలిపారు. ఈ నెల 13న నియోజకవర్గంలోని 237 పోలింగ్‌ బూతుల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఒక రౌండుకు 14 టేబుళ్లు సిద్ధం చేశామని, ఇందుకు అవసరమైన సిబ్బంది, అధికారులను నియమించామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,08,350 మంది ఉండగా.. 1,75,667 ఓట్లు పోలయ్యాయి. జూన్‌ 4వ తేదీన కర్నూలులో జరిగే కౌంటింగ్‌కు 17 రౌండ్లలో ఒక్కో రౌండుకు 14 టేబుళ్లు, 14 మిషన్లతో లెక్కింపు చేయడం జరుగుతుందని ఆర్వో, ఏఆర్వో తెలిపారు. ఇప్పటికే భద్రతా, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 12:18 AM