అచ్చెన్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 8కి వాయిదా
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:24 AM
ఏపీ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ 2021 డిసెంబరులో నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఏపీ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ 2021 డిసెంబరులో నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద స్పందిస్తూ... ఈ వ్యవహారంలో అదనపు దస్త్రాలు కోర్టు ముందు ఉంచేందుకు రెండు వారాలు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లిఖార్జునరావు విచారణను మే 8కి వాయిదా వేశారు.