Share News

తిరుమల ఘాట్‌లో మరో ప్రమాదం

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:17 AM

తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో బుధవారం మధ్యాహ్నం ముందు వెళుతున్న డీజిల్‌ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది.

తిరుమల ఘాట్‌లో మరో ప్రమాదం

డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురికి గాయాలు

తిరుమల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో బుధవారం మధ్యాహ్నం ముందు వెళుతున్న డీజిల్‌ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆర్టీసీ డిపోకు డీజిల్‌ తీసుకుని ట్యాంకర్‌ తిరుపతి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలోని లింక్‌ రోడ్డుకు సమీపంలో భక్తులతో వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ట్యాంకర్‌ను ఒక్కసారిగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ముందు కూర్చుని ఉన్న మహారాష్ట్ర, విజయవాడకు చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించారు. లారీ ఒక్కసారిగా అగడంతో ఢీకొన్నట్టు ఆర్టీసీ డ్రైవర్‌ చెబుతుండగా, రన్నింగ్‌లో ఉన్న తన లారీని.. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొందని లారీ డ్రైవర్‌ చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:17 AM