Share News

APPLY : ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:22 AM

సోమందేపల్లి సర్వేనంబరు 700లో మూడు నెలలనుంచి 150గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమకు ఇళ్ల పట్టాలు అందించాలని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి పేర్కొ న్నారు. ఆయన సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు.

APPLY : ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి

పెనుకొండ టౌన, ఏప్రిల్‌ 29: సోమందేపల్లి సర్వేనంబరు 700లో మూడు నెలలనుంచి 150గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమకు ఇళ్ల పట్టాలు అందించాలని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి పేర్కొ న్నారు. ఆయన సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదలు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టి వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు సబ్‌ కలెక్టర్‌ అయినా పట్టించుకోవాలన్నారు. తమను గుర్తించి ఇళ్ల పట్టాలు అందిస్తే ఇళ్లు నిర్మించుకుంటామని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 12:23 AM