Share News

TDP : గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:06 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు బుధవారం అధిక సంఖ్యలో తరలివెళ్లి అభినందనలు తెలిపారు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు పుష్ఫగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.. పూలమాలలు, శాలువలతో సత్కరించారు.

TDP : గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ
TDP leaders honoring Parthasarathi in Maruvapalli

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు బుధవారం అధిక సంఖ్యలో తరలివెళ్లి అభినందనలు తెలిపారు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు పుష్ఫగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.. పూలమాలలు, శాలువలతో సత్కరించారు.

పెనుకొండ రూరల్‌, జూన 5 : వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్మోహనరెడ్డి చేసిన అరాచకాలు, ఉద్యోగులపై చిన్నచూపు చూడటం వంటి వాటితో ప్రజలు విసుగు చెందారని హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. దీనికి తోడు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి, మేలును గుర్తించడంతో టీడీపీ కూటమికి మంచి ఫలితాలు లభించాయన్నారు. ఆయన పట్టణంలోని మడక శిర రహదారిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి బీకే బుధవారం వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అం దించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బుధ వారం రొద్దం మండలంలోని ఆర్‌ మరువపల్లిలో ఆయన స్వగృహంలో కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలువేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా సవిత బుధవారం మండలపరిధిలోని రాంపురంలో ఉన్న తన తండ్రి ఎస్‌ రామచంద్రారెడ్డి సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను ఘనంగా సత్కరించారు.

గోరంట్ల: మండలంలోని మరవపల్లి, రాంపురం గ్రామాల టీడీపీ నాయకులు బుధవారం పెనుకొండకు తరలివెళ్లారు. బీకే పార్థసారథి, సవితను కలిసి పుష్పగు చ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. శాలువ, పూల మాలతో సత్కరించారు. టీడీపీ మండల కన్వీనర్‌ సోము శేఖర్‌, దేవ నరసింహులు, ఉమ్మర్‌ఖాన, గిరిధర్‌ గౌడ్‌, అజంతుల్లా, శీనా, జయరాం, రామమోహన, రామచంద్ర, చలపతి, గణేష్‌, వెంకటరెడ్డి, నరేష్‌యాదవ్‌, సుబ్బరాయుడు, ఉమాశంకర్‌ తదితరులు ఉన్నారు.

హిందూపురం అర్బన: పరిగి మండల నాయకులు బుధవారం పెనుకొండ లో సవితను కలిసి అభినందనలు తెలిపారు. కార్యకమ్రంలో మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ శీగుపల్లి కృష్ణమూర్తి, నాయకులు సోమప్ప, గోపాల్‌రెడ్డి, అశ్వత్థనారాయణప్ప, పాపిరెడ్డి, గోవిందరెడ్డి తదితరులు పేర్కొన్నారు. అదే విధంగా వడ్డెర సాధికార సంఘం రాష్ట్ర నాయకుడు హనుమయ్య తదితరులు బుధవారం సవితను కలిసి పూలమాలతో సత్కరించారు.

Updated Date - Jun 06 , 2024 | 12:06 AM